దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
- ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై గందరగోళం
- రిటైర్డ్ జడ్జి నాగరాజును నియమిస్తూ జీవో 447 జారీ
- కొద్ది గంటల వ్యవధిలోనే వెబ్సైట్ నుంచి జీవో తొలగింపు
- ప్రభుత్వ చర్యతో కొనసాగుతున్న ఉత్కంఠ, అనిశ్చితి
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రిటైర్డ్ జిల్లా జడ్జిని చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, కొద్ది గంటల వ్యవధిలోనే ఆ జీవోను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య పరిణామంతో నియామక ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్ నాగరాజును ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్గా నియమిస్తూ నిన్న దేవాదాయ శాఖ ఎక్స్-అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్లాల్ జీవో నంబర్ 447ను జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, జీవోను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే దాన్ని తొలగించారు. ఈ పరిణామంతో అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది.
.
వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్ నాగరాజును ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్గా నియమిస్తూ నిన్న దేవాదాయ శాఖ ఎక్స్-అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్లాల్ జీవో నంబర్ 447ను జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, జీవోను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే దాన్ని తొలగించారు. ఈ పరిణామంతో అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది.